కాగజ్ నగర్, వెలుగు : ఓటరు జాబితాలో స్త్రీలను పురుషులుగా మార్చారు. ఒకటి కాదు, రెండు కాదు చాలా చోట్ల ఓటరు జాబితాలో పేరు, ఊరు పేరు, వయసు, లింగం తప్పుగా వచ్చాయి. చింతల మానేపల్లి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో శనివారం నుంచి పోల్ చిట్టీల పంపిణీ మొదలైంది.
అందులో చాలా చోట్ల మహిళలను పురుషులుగా మార్చారు. జెండర్ స్థానంలో మహిళకు బదులు పురుషుడిగా చూపారు. చాలా సార్లు ఓటరు సవరణ చేసినా సంబంధిత బీఎల్ఓ లు, సూపర్ వైజర్ లు కనీసం ఆడ, మగ ఎవరన్నది చూడకుండా ఫైనల్ చేశారని ఓటర్లు ఆరోపిస్తున్నారు.