ఫీజు క‌డితేనే క్లాసులు.. త‌ల్లిదండ్రుల్ని బెదిరిస్తున్న‌ ప్రైవేట్ స్కూల్స్ యాజ‌మాన్యాలు

ఫీజు క‌డితేనే క్లాసులు.. త‌ల్లిదండ్రుల్ని బెదిరిస్తున్న‌ ప్రైవేట్ స్కూల్స్ యాజ‌మాన్యాలు

క‌రోనా క్రైసిస్ లో పిల్ల‌ల‌కు స్కూల్ ఫీజ్ క‌ట్టాలంటే త‌ల్లిదండ్రులు ప‌డే బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. క‌రోనా కార‌ణంగా ఉద్యోగాలు లేక, వ‌చ్చిన జీతాలు స‌రిపోక‌పోవ‌డంతో పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులు క‌ట్ట‌డం మ‌రింత భారంగా మారింది. దీన్ని అవ‌కాశంగా తీసుకున్న ప్రైవేట్ స్కూల్స్ యాజ‌మాన్యాలు విద్యార్ధుల త‌ల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నాయి.

క‌ర్ణాట‌కు చెందిన బెంగ‌ళూరులో ప్రైవేట్ స్కూల్ యాజ‌మాన్యాల ఆగ‌డాల‌కు విద్యార్ధుల త‌ల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్ర‌యిస్తున్నారు. న‌గ‌రంలో ప‌లు ప్రైవేట్ విద్యా సంస్థ‌లు స్కూల్ క‌ట్టిన విద్యార్ధుల‌కు ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నాయి. స్కూల్ ఫీజ్ క‌ట్టండి లేదంటే పిల్ల‌ల‌కు క్లాసుల‌కు నిర్వ‌హించం అని హెచ్చ‌రించ‌డంతో త‌ల్లిదండ్రులు ఆర్టీఈ, టాస్క్ పోర్స్ సంబంధిత డిపార్ట్మెంట్ అధికారుల‌కు ఫిర్యాదు చేస్తున్నారు

ఉద్యోగాలు లేక పిల్ల‌ల‌కు ఫీజులు క‌ట్టే స్థితిలో లేమ‌ని, వాయిదాల రూపంలో ఫీజులు చెల్లించినా క్లాసులు నిర్వ‌హించ‌డం లేద‌ని త‌ల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజ‌మాన్యాల ఆగ‌డాల నుంచి త‌మ‌ని కాపాడాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు.