ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకంటే సర్పంచ్లకే నిధులెక్కువ

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకంటే సర్పంచ్లకే నిధులెక్కువ

యాదాద్రి, వెలుగు: ఎంపీటీసీల మాదిరిగానే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా నిధులు లేవని రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి భువనగిరిలో జరిగిన పంచాయతీ రాజ్‌ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కంటే సర్పంచ్‌లకే ఎక్కువ నిధులు వస్తున్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఆర్థిక పరిస్థితి కుంటుపడిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని తెలిపారు. అప్పుల్లో కూరుకున్న రైతులను ఆదుకోవడానికి రూ. లక్ష రుణమాఫీ చేసినా  పరిస్థితి మెరుగు పడలేదన్నారు. దోమకాటుకు కూడా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని, పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే ఇందుకు కారణమన్నారు.