‘మా ఊర్లో గణపతులు పెట్టం’

‘మా ఊర్లో గణపతులు పెట్టం’

నిజామాబాద్,  భిక్కనూరు, వెలుగు : కరోనా నేపథ్యంలో ఈసారి గణపతులను పెట్టొద్దని తలమడ్ల గ్రామంలో శనివారం తీర్మానించినట్లు సర్పంచ్ యాదవరెడ్డి తెలిపారు. గ్రామంలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తే జనాలు గుమిగూడే అవకాశం ఉన్నందున కరోనా వ్యాప్తి చెందుతుందని ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.