త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సెహ్వాగ్ నిరాకరించాడని ఢిల్లీకి చెందిన బీజేపీ నేత స్పష్టం చేశారు. ఎన్నికల వేళ రాజకీయ నాయకులు సెలబ్రెటీలను బరిలోకి దించడం మామూలే. ఈ క్రమంలోనే పశ్చిమ ఢిల్లీ నుంచి సెహ్వాగ్ను బరిలో దింపాలని బీజేపీ భావించిందని.. అందుకు ఆయన ఆసక్తి చూపండం లేదని అన్నారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజకీయల్లోకి రావడం లేదని, రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన… ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి లేదని సెహ్వాగ్ స్పష్టం చేసినట్లు బీజేపీ నేత చెప్పారు. వీరేంద్ర సెహ్వాగ్ బీజేపీ టిక్ట్ పై హర్యానాలోని రోహ్తక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఈ ఏడాది ఫిబ్రవరిలో వార్తలు వచ్చాయి. దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ..అవన్నీ తప్పుడు వార్తలేనని కొట్టిపారేశారు.