న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్లు

న్యాయపరమైన చిక్కులు రాకుండా నోటిఫికేషన్లు
  • ప్లాన్​ చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ రావు​ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఉగాది లోపు తొలి నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్లాన్ చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సోమవారం బీఆర్కే భవన్ లో ఉద్యోగాల భర్తీపై ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ చేశారు. ముందుగా గ్రూపు–1 నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖకు సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించారు.