ముంబైపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న హీరోయిన్ కంగనా రనౌత్ కు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(BMC) అధికారులు షాక్ ఇచ్చారు. ఆమెకు చెందిన అక్కడి పాళి హిల్ బంగ్లాకు మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా మార్పులు చేశారంటూ అధికారులు ఆ బంగళా గేటుకు నోటీసులు అంటించారు.
ఈ బంగ్లాను మణికర్ణిక ఆఫీసు పేరుతో కంగనా కట్టించుకుంది. ఈ కార్యాలయం వేదికగానే ఆమె సినిమాలు నిర్మిస్తోంది. ముంబైలోని తన కార్యాలయాన్ని అధికారులు కూల్చబోతున్నట్లు కంగనా ఇటీవల ఆరోపించింది.ఈ క్రమంలోనే నిన్న(సోమవారం) ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయంపై బీఎంసీ అధికారులు దాడులు చేశారు. BMC అధికారులు అందులోకి బలవంతంగా చొరబడ్డారని, అన్ని కొలతలు చూసుకున్నారని కంగనా మరోసారి ఫైర్ అయ్యింది. తన ఆఫీసుకు సంబంధించి అక్రమాలు ఏమీ లేవని స్పష్టం చేసింది.
అయితే, మునిసిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 /A కింద నటి కార్యాలయ గేటుపై మూడు పేజీల నోటీసును అతికించామని అధికారులు అంటున్నారు.. తమకు ఆ కట్టడంపై వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశించారు.