శామీర్పేట, వెలుగు: ఉద్దమర్రి చెరువు భూమిలో ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టగా.. ఇరిగేషన్ అధికారలు దాన్ని తొలగించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలోని పెద్ద చెరవుకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఏరియాలో రూల్స్ కు విరుద్ధంగా ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణాన్ని మొదలుపెట్టాడు.
పెద్ద ఎత్తున మట్టిని తెచ్చి మొరం పోశాడు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు గురువారం ఆ మట్టిని తొలగించారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక పీఎస్లో కంప్లయింట్ చేశారు.