ఉద్దమర్రి చెరువులో రోడ్డు.. మట్టిని తొలగించిన అధికారులు

ఉద్దమర్రి చెరువులో రోడ్డు..  మట్టిని తొలగించిన అధికారులు

శామీర్​పేట, వెలుగు: ఉద్దమర్రి చెరువు భూమిలో ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణాన్ని చేపట్టగా.. ఇరిగేషన్ అధికారలు దాన్ని తొలగించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలోని పెద్ద చెరవుకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఏరియాలో రూల్స్ కు విరుద్ధంగా ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. 

పెద్ద ఎత్తున మట్టిని తెచ్చి మొరం పోశాడు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు గురువారం ఆ మట్టిని తొలగించారు. ఎఫ్టీఎల్, బఫర్​జోన్​లో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక పీఎస్​లో కంప్లయింట్ చేశారు.