24 ఏళ్ల క్రితం అమెరికాలోని ఒక్లహామాలోజరిగిన అత్యంత దారుణమైన బాంబ్ అటాక్ కు ప్రత్యక్ష సాక్షి ఆ ఎల్మ్ ట్రీ. ఆ దాడిని తట్టుకుని ఇన్నేళ్లు నిలిచింది. నెమ్మదిగా కోలుకుని తన పేరునే ‘సర్వైవల్ ట్రీ’గా మార్చుకుంది. హోప్ కు సింబల్గా మారింది.ఇప్పుడు హోప్ ట్రీని రక్షించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి . దాని డీఎన్ఏని సేకరించేందుకు సైంటిస్టులు ట్రై చేస్తున్నారు. 1995 ఏప్రిల్ 19న ఒక్లహామాలోని ఆల్ఫ్రెడ్ పి.ముర్రా ఫెడరల్ బిల్డింగ్ వద్ద భారీపేలుడు జరిగింది. పెద్దలు, పిల్లలు కలిపి 168 మందిఆ దాడిలో మరణించారు. ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలతో పేలుడుకు పాల్పడటంతో బిల్డింగ్ సగం కూలిపోయింది. ఆ బిల్డింగ్ ను ఆనుకుని ఉన్న ఎల్మ్ ట్రీ కూడా దెబ్బతింది. ప్రస్తుతం ఒక్లహామా సిటీ నేషనల్ మెమోరియల్లో ఈ చెట్టు ఉంది. అక్కడ చనిపోయిన వారికి గుర్తుగా 168 కుర్చీలను ఏర్పాటుచేశారు. ఆ చెట్టు కొద్దికొద్దిగా రికవరీ అవుతూ 24ఏళ్లు బతికింది. ప్రస్తుతం ఆ చెట్టు వయసు వందేళ్లు.సాధారణంగా ఎల్మ్ ట్రీ 150 ఏళ్లు బతుకు తుంది.అయితే బాంబు పేలుడుకు గురి కావడంతో ఈ చెట్టుఎప్పుడు చనిపోతుందో తెలియని పరిస్థితి. బాంబుపేలుడు జరిగిన 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోకల్ లీడర్లు, అధికారులు శుక్రవారం.. క్లోన్ చేసిన ఎల్మ్ ట్రీని నాటారు. సర్వైవల్ ట్రీ సీడ్ ద్వారా పెరిగినమరో చెట్టు మొదళ్ల నుంచి డీఎన్ఏను సేకరించి దీనికి ప్రాణం పోశారు. సర్వైవల్ ట్రీ చనిపోయిన తర్వాత దాని స్థానంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం నర్సరీ వర్కర్లు కొత్త చెట్టు ను ప్రత్యేకంగా రూపొందించిన ఓ చోటుకు తరలించారు. ఇది ఒరిజినల్ ట్రీ ఉన్న ప్రాంతానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొత్త చెట్టును మొదళ్లతో పాటుతరలించే మెషినరీని ఈ సిద్ధంగా ఉంచారు.