అనాథ పిల్లలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తం

అనాథ పిల్లలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తం

వజ్రోత్సవాల సందర్భంగా పంద్రాగస్టు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా10 లక్షల మందికి పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఫించను అందజేస్తున్నామని కొత్త వారితో కలుపుకొని ఆ సంఖ్య 46 లక్షలకు చేరుతుందని అన్నారు. డయాలసిస్ పేషెంట్లకు సైతం పెన్షన్ ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు. అనాధ పిల్లలను స్టేట్ చిల్డ్రన్స్ గా గుర్తించడంతో పాటు వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు బీమా పథకం తీసుకొస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గాలికి తప్ప అన్నింటికీ పన్నులు వేస్తోందని విమర్శించిన కేసీఆర్.. పాలు,బీడీలు, చేనేత మీద జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.