ఎంతొచ్చిందో ఇంపార్టెంటే.. ఎంత బాగుందనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్: అడవి శేష్

ఎంతొచ్చిందో ఇంపార్టెంటే.. ఎంత బాగుందనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్:  అడవి శేష్

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హాయ్‌ నాన్న (Hi Nanna). డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ (Shouryuv) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మృణాళ్‌ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధంతో వస్తోన్న ఈ మూవీలో..నానికి కూతురుగా బేబీ కియారా ఖన్నా కనిపించనుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ప్యూర్ ఎమోషన్ తో ఆడియాన్స్ ను ఆకట్టుకుంటోంది. 

ALSO READ : విజయ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 'లియో' మార్నింగ్ షోస్ క్యాన్సిల్

టీజర్ ఈవెంట్ లో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానం ఇచ్చారు. నాని గత చిత్రాలైన జెర్సీ, శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్ కు నిర్మాతలకు నష్టాలూ వచ్చాయంటూ..ఒక ప్రముఖ జనరలిస్ట్ అడిగిన ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లేటెస్ట్ గా హీరో అడవిశేష్(Adivi Sesh) చేసిన ట్వీట్.. మీడియా ప్రశ్నించిన దానిపై రియాక్ట్ అయ్యి ఉంటారని భావిస్తున్నారు. అడవి శేష్ పోస్ట్ చేస్తూ..ఎంత వచ్చిందో ఇంపార్టెంటే అన్నయ్యా..కానీ, ఎంత బాగుంది అనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్..అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం అడవి శేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వాస్తవానికి నాని నటించిన జెర్సీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ చాలా ఇంటెన్స్ సబ్జెక్టు తో తెరకెక్కినవి. ఈ మూవీలో సాంగ్స్, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ను కంటతడి పెట్టేలా చేశాయి. ఇక అడవి శేష్ చేసిన ట్వీట్ తో..ఎవరు రియాక్ట్ అవుతారో చూడాలి మరి. 

హాయ్ నాన్న మూవీని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది.