ఏనుగు దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాద సంఘటన కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా మున్నార్ సమీపంలో ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. మున్నార్ దగ్గర కన్నీమల ఎస్టేట్కు చెందిన సురేష్ అలియాస్ మణి(45) ఆటోరిక్షాపై ఓ అడవి ఏనుగు దాడి చేసింది.ఈ ఘటనలో డ్రైవర్ సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆటోలో ఉన్న రాజా, అతని భార్య రెజీనాకు గాయాలయ్యాయి. వారి కూతురు క్షేమంగా బయటపడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఏనుగుల దాడి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ALSO READ :- ఈ అర్హత, ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే .. రూ.500కే గ్యాస్ సిలిండర్ వస్తది
మున్నార్లో తరచుగా జరుగుతున్న అడవి - జంతువుల దాడిలో మనుషులు ప్రాణాలు కోల్పోతుండటంపై పలు రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు.