చిత్ర పరిశ్రమలో వారసుల పరిచయం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది ప్రముఖుల వారసులు తెలుగు తెరపై అరంగేట్రం చేయడం చూశాం. ప్రేక్షకుల మెప్పు పొందిన వారు కొందరైతే…ఆదరణ కరువై వెనుదిరిగిన వారు మరికొందరు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు. మహేశ్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఆదివారం అశోక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని తన లుక్ను విడుదల చేశారు. టేబుల్పై కూర్చుని, ల్యాంప్ వెలుగులో పుస్తకం చదువుతున్న అశోక్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. జగపతిబాబు, నరేష్, సత్య, అర్చనా సౌందర్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపు సగం పూర్తయిందని.. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
For More News..