ఈ రోజు కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న

ఈ రోజు కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న

ఓవైపు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంది. మరోవైపు సోషల్‌‌ మీడియాలో ఎప్పటికప్పుడు కబుర్లతో, గ్లామరస్‌‌ ఫొటోలతో ఎంటర్‌‌‌‌టైన్ చేస్తుంది. అందుకే పూజా హెగ్డే ఫాలోయింగ్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది. రీసెంట్‌‌గా ఓ కొత్త కబురు చెప్పింది పూజ. ముంబైలో ఆమె ఓ ఇల్లు కట్టుకుంది. ఈ మధ్యనే గృహప్రవేశం కూడా చేసింది. ఈ రోజు కోసం ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నానని, తన కల ఇప్పటికి నెరవేరిందని ఆనందంగా చెప్పింది.

మొన్నటి వరకు మాల్దీవుల్లో హ్యాపీగా గడిపిన పూజ.. త్వరలో మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనుంది. రాధేశ్యామ్, ఆచార్య రిలీజ్‌‌కి రెడీగా ఉన్నాయి. విజయ్‌‌కి జోడీగా నటించిన ‘బీస్ట్’ కూడా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. రణ్‌‌వీర్‌‌‌‌ సింగ్‌‌తో కలిసి యాక్ట్ చేసిన ‘సర్కస్‌‌’ జులైలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. సల్మాన్‌‌తో చేస్తున్న ‘భాయీజాన్‌‌’ కూడా ఈ సంవత్సరమే రాబోతోంది. ఇక త్వరలో మహేష్‌‌ బాబు, త్రివిక్రమ్‌‌ల సినిమాలోనూ జాయిన్ కానుంది. ఒక తమిళ చిత్రం, ఒక హిందీ చిత్రం కూడా ఇటీవల ఆమె ఖాతాలో పడినట్లు తెలుస్తోంది.