భారీగా పెరిగిపోతున్న ఉల్లి ధరలు

భారీగా పెరిగిపోతున్న ఉల్లి ధరలు

ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగిపోయాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.100గా ఉంది. ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఢిల్లీలో ఉల్లిపాయలను ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.50 70 మధ్య అమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వీటి ధర రూ.70 నుంచి 80 మధ్య ఉంది. రెండు నెలల క్రితం కిలో ఉల్లి ధర రూ.80కి చేరింది. మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉల్లి సాగు తగ్గిపోయింది. ఉల్లి ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కిలో ఉల్లిపాయలు కొందామని వెళ్లిన వారు… పావు కిలోతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు.