IPL: రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే

IPL: రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే

భారత్ లో క్రికెట్ అంటే ఎంతో క్రేజ్ ఉంది. ఇతర ఏ దేశాల్లో లేనంతగా మన దేశంలో క్రికెట్ అభిమానులున్నారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత వారి సంఖ్య మరింత పెరిగింది. అయితే..వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ ను సరికొత్తగా నిర్వహించాలని బీసీసీఐ వర్గాలు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు వీకెండ్ రోజుల్లో రెండేసి మ్యాచ్ లు నిర్వహించేవారు. ఇకపై ప్రతి రోజూ ఒకే మ్యాచ్, అది కూడా రాత్రివేళల్లోనే నిర్వహించాలని భావిస్తున్నారు. అంతేకాదు ఐపీఎల్ టైం కూడా రెండు నెలలకు పొడిగించాలన్నది ఓ ప్రతిపాదన. త్వరలోనే జరిగే బీసీసీఐ పాలకమండలి సమావేశంలో తాజా ప్రతిపాదనలకు అనుమతి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.