న్యూఢిల్లీ: ఐపీఎల్ మెగా ఆక్షన్కు రెండు వారాల టైమ్ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ప్లేస్ ఎక్కడనే దానిపై సస్పెన్స్ వీడటం లేదు. వేలం జరిగే ప్లేస్పై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దీంతో ఫ్రాంచైజీలన్నీ కన్ఫ్యూజన్లో పడ్డాయి. పాత షెడ్యూల్ ప్రకారం బెంగళూరులో వేలం ప్రక్రియను నిర్వహించాలని అనుకున్నారు. కానీ కొవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడటంతో ఆక్షన్ డేట్స్తో పాటు వెన్యూలో కూడా మార్పులు ఉంటాయని బోర్డు తెలిపింది. అయితే, వచ్చే నెల 12, 13న ఆక్షన్ ఉంటుందని బోర్డు పేర్కొన్నా.. ప్లేస్ను మాత్రం ఖరారు చేయలేదు.
చెన్నైకి ధోనీ..ఆక్షన్పై ఫోకస్
మెగా ఆక్షన్ కోసం సీఎస్కే ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కెప్టెన్ ధోనీ చెన్నైకి చేరుకున్నాడు. కెప్టెన్గా తనకు ఇది లాస్ట్ ఆక్షన్ కావడంతో మహీ సీరియస్గా దీనిపై దృష్టిపెట్టాడు. రాబోయే పదేళ్లు అందుబాటులో ఉండేలా మంచి కోర్ గ్రూప్ను రెడీ చేయాలని చూస్తున్నాడు. మహీ కూడా డైరెక్ట్గా ఆక్షన్కు వచ్చే చాన్సుంది.