
2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారత్ స్థాపిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అన్నట్లుగానే మావోయిస్టులను ఏరివేస్తోంది. కీలక నేతలను అంతం చేయడం లేదంటే అదుపులోకి తీసుకుంటే మిగతా దళాల సభ్యులు లొంగిపోవడం తేలికైన విషయంగా భావిస్తోంది. అందులో భాగంగా అగ్రనేతలే టార్గెట్ గా ఆపరేషన్ కగార్ ను తీవ్ర స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర బలగాలు మొత్తం 540 మంది నక్సల్స్ ను ఎన్ కౌంటర్ చేశారు.
ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులు కీలక నేతలను కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు దళపతిని కోల్పోయారు. దండకారణ్య స్పెషల్ జోన్ దాదాపు ఖాళీ అయింది. దీంతో ఏవోబీ కమిటీ ఉనికిని కోల్పోయినట్లైంది.
ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులకు కోలుకోలేని వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టుల కంచుకోటల్లోకి కేంద్ర బలగాలు చొచ్చుకుపోతున్నాయి. ఇటీవలి ఎన్ కౌంటర్ లలో కీలక నేతలను కోల్పోయింది మావోయిస్టు పార్టీ.
2024 నుంచి ఇప్పటి వరకు 330 మంది నక్సల్స్ మృతి చెందారు. దీంతో కేంద్ర కమిటీ సభ్యులు ఖాలీ అవుతున్నారు. మవోయిస్టు పార్టీకి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కీలకం. అయితే కమిటీ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది.
ఏపీ, తెలంగాణల్లో ప్రత్యేకంగా దళాలు లేని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు కమిటీలో 18 మంది కీలక నేతలు ఉండగా.. వరుస ఎన్కౌంటర్ల తో ఏఓబీ కమిటీ కూడా ఉనికిని కోల్పోయినట్లైంది.