
- ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న మేజర్ సాయి భార్గవ్కు సన్మానం
దిల్సుఖ్ నగర్, వెలుగు: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్చేపట్టి, విజయం సాధించిందని పలువురు వక్తలు తెలిపారు. కోదాడ ఆత్మీయ ప్రవాస సమితి, అపోలో మెడికల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చైతన్యపురిలోని అపోలో కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ‘సెల్యూట్ టు సోల్జర్స్’ కార్యక్రమం నిర్వహించారు. రిటైర్డ్ కలెక్టర్ ఎం.వి. రెడ్డి, ఐఏఎస్ అధికారి బుర్రి రామయ్య ముఖ్య అతిథులుగా హాజరు కాగా, పలువురు ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.
మేజర్ సాయి భార్గవ్ ఆపరేషన్ సిందూర్ లో తన అనుభవాలను, పాక్ డ్రోన్ దాడులను తిప్పికొట్టిన విధానాన్ని వివరించారు. యువతను ఆర్మీలో చేరేలా ప్రోత్సహించాలని రిటైర్డ్ కల్నల్ సుంకర శ్రీనివాసరావు సూచించారు. ఈ సందర్భంగా మేజర్ సాయి భార్గవ్తో పాటు మాజీ ఆర్మీ అధికారులను సత్కరించి, వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. అపోలో అకాడమీ డైరెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.