ఆపరేషన్ చేశారు..కడుపులో కాటన్ మరిచారు

ఆపరేషన్ చేశారు..కడుపులో కాటన్ మరిచారు

డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.  ఓ మహిళలకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కడుపులో కాటన్ మర్చిపోయారు. ఈ దారుణమైన ఘటన సిద్దిపేటలో జరిగింది.సిద్దిపేటకు చెందిన ఓ మహిళ అనారోగ్యం కారణంగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చింది. అయితే.. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ అవసరమని తెలిపి అందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు కడుపులో కాటన్ మరిచిపోయారు. దీంతో ఆ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కడుపు నొప్పి రావడంతో మరో ఆస్పత్రికి వెళ్లి చూపించగా…అసలు విషయం బయట పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.