రాత్రి తాగి వచ్చి రమ్మని పిలుస్తుర్రు.. ఉస్మానియా పీజీ హాస్టల్ విద్యార్థుల ధర్నా..

రాత్రి తాగి వచ్చి రమ్మని పిలుస్తుర్రు.. ఉస్మానియా పీజీ హాస్టల్ విద్యార్థుల ధర్నా..

ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పీజీ కాలేజ్ విద్యార్థులు ధర్నా చేశారు. రాత్రి 2 గంటలకు ముగ్గురు ఆగంతకులు తాగి లేడీస్ హాస్టల్లోకి వచ్చారని హాస్టల్ వాష్రూమ్ వెంటిలేటర్స్ నుంచి చేతులు పెట్టి రమ్మని పిలుస్తున్నారని విద్యార్థులు తెలిపారు. స్టూడెంట్స్ అందరం కలిసి ఒక వ్యక్తిని పట్టుకున్నామని  అన్నారు. ఇద్దరు పారిపోయారని చెప్పారు. గత వారం రోజులుగా ఇలాగే జరుగుతుందని కాలేజ్ చుట్టూ గంజాయి బ్యాచ్ పెరిగిపోయిందని తెలిపారు. 

250 మంది విద్యార్థినులు ఉండే హాస్టల్ కి కేవలం ఒకరే సెక్యూరిటీ గార్డ్ ఉన్నారని విద్యార్థులు తెలిపారు. వీసీ వచ్చి మాకు పూర్తి భద్రత కల్పించాలని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా దగ్గరికి పోలీసులు చేరుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ధర్నా వద్దకు వచ్చిన ఓయూ రిజిస్ట్రార్ విద్యార్థులను ధర్నా విరమించమని కోరారు. వీసీ వచ్చే వరకు ధర్నా విరమించబోమంతున్న  స్టూడెంట్స్ తెలిపారు.