ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఫైనల్ దశ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్59 నియోజకవర్గాల్లోని 10,01,75,153ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్థానాల నుంచి 918 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
పశ్చిమబెంగాల్లో హింసాత్మక ఘటనల క్రమంలో అదనపు బలగాలను మోహరింపజేశారు. ఇవాళ జరిగే పోలింగ్తో కలిపితే.. దేశంలో 542 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసినట్లవుతుంది. చివరి దశ పోలింగ్ సందర్భంగా దేశంలోని అందరి కళ్లూ వారణాసి నియోజకవర్గంపైనే ఉన్నాయి. ఇక్కడ మోడీ, మరో 25 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.
West Bengal: Visuals from polling booth no.153 in Kolkata Dakshin Lok Sabha Constituency. Voting for the 7th and last phase of #LokSabhaElections2019 will begin at 7 AM today. pic.twitter.com/AUl8WrruzF
— ANI (@ANI) May 19, 2019