ఉప్పల్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దుర్మార్గపు చర్యగా అని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. బుధవారం ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నీట్లీకేజీపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
