సికింద్రాబాద్​లో హ్యాట్రిక్ పక్కా: పద్మారావు గౌడ్

సికింద్రాబాద్​లో హ్యాట్రిక్ పక్కా: పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని.. సికింద్రాబాద్ సెగ్మెంట్​లో తాను హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సీతాఫల్ మండి, మెట్టుగూడ, బౌద్ధనగర్ డివిజన్​లో జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేశానని ఆయన తెలిపారు. ఇయ్యాల సికింద్రాబాద్​లో జరగనున్న మంత్రి కేటీఆర్ రోడ్ షో, సభకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన కోరారు. శనివారం సాయంత్రం 6 గంటలకు అడ్డగుట్టలోని రియో పాయింట్ వద్ద, మైలార్ గడ్డ ఎస్వీఎస్ సర్కిల్ వద్ద రాత్రి 7 గంటలకు కేటీఆర్ రోడ్​ షో, సభ ఉంటుందని పద్మారావు గౌడ్ తెలిపారు.