కేరళ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ విచారం

కేరళ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ విచారం

న్యూఢిల్లీ: కేరళలోని ఇడుక్కి జిల్లా, రాజమలై ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి 15 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో ప్రవాహంలో మరో 50 మంది చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ‘ఇడుక్కిలోని రాజమలై ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. బాధాతప్త సమయంలో బాధిత కుటుంబాలతో నా ఆలోచనలు ఉంటాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఎన్‌డీఆర్‌‌ఎఫ్​తో పాటు పరిపాలక విభాగం గ్రౌండ్ లెవల్‌లో శ్రమిస్తున్నారు’ అని మోడీ ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయన్ని కేంద్రం ప్రకటించింది.