న్యూఢిల్లీ: కేరళలోని ఇడుక్కి జిల్లా, రాజమలై ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి 15 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో ప్రవాహంలో మరో 50 మంది చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ‘ఇడుక్కిలోని రాజమలై ప్రాంతంలో జరిగిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. బాధాతప్త సమయంలో బాధిత కుటుంబాలతో నా ఆలోచనలు ఉంటాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఎన్డీఆర్ఎఫ్తో పాటు పరిపాలక విభాగం గ్రౌండ్ లెవల్లో శ్రమిస్తున్నారు’ అని మోడీ ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయన్ని కేంద్రం ప్రకటించింది.
Pained by the loss of lives due to a landslide in Rajamalai, Idukki. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover quickly. NDRF and the administration are working on the ground, providing assistance to the affected.
— Narendra Modi (@narendramodi) August 7, 2020