మోడీని పేల్చేస్తా: ‘బాంబులు’ కట్టుకుని పాక్ సింగర్ పోజ్

మోడీని పేల్చేస్తా: ‘బాంబులు’ కట్టుకుని పాక్ సింగర్ పోజ్
  • ఇది పాకిస్థాన్ నేషనల్ డ్రస్ కదా అంటూ ట్విట్టర్ లో ట్రోలింగ్

భారత ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ పాప్ సింగర్ రబీ పిర్జాడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏకంగా పేల్చేస్తానంటూ ‘సూసైడ్ బాంబర్’ జాకెట్ వేసుకుని ట్విట్టర్లో ఫొటో పెట్టింది. తాను కశ్మీరీ బిడ్డనంటూ, మోడీని హిట్లర్ తో పోలుస్తూ ట్వీట్ చేసింది. ఆ ఫొటో ట్విటర్లో వైరల్ గా మారింది. వాస్తవానికి ఆమె లాహోర్ కు చెందిన సింగర్. కానీ ఆర్టికల్ 370 రద్దు నాటి నుంచి భారత్ పై విషం కక్కుతోంది. కశ్మీర్ పై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్లు చేస్తోందామె.

పాకిస్థాన్ నేషనల్ డ్రస్!

పాక్ సింగర్ రబీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీన్ని మెచ్చుకుంటూ కొందరు  పాకిస్థానీలు రీట్వీట్లు చేశారు. కొంతమంది పాక్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నావంటూ తిట్టిపోశారు.

ఇక భారతీయులు కూడా ఆ ట్వీట్ పై స్పందించారు. ‘ఇది మీ నేషనల్ డ్రస్’ కదా అంటూ చాలా మంది సెటైర్లు వేశారు. మీ ట్రెడిషనల్ డ్రస్ లో చాలా అందంగా ఉన్నావ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పాక్ డెవలప్ చేసిన ప్రత్యేకమైన డ్రస్ ని ప్రపంచమంతా చూస్తోందంటూ మరికొందరు ట్వీట్ చేశారు. కశ్మీరీలు భారత్ లో సేఫ్ గా ఉన్నారని, ఇలాంటి సేఫ్టీ కావాల్సింది పాకిస్థానీలకే అని కామెంట్లు పెట్టారు.

గత నెలలో పాములతో బెదిరింపు

పాక్ సింగర్ రబీ ఇలా చేయడం తొలిసారి కాదు. గత నెల 15న ప్రధాని మోడీపై ఆమె విషం కక్కింది. పాములను పట్టుకుని చూపిస్తూ వాటిని ఆయనపై వదిలి కరిపిస్తానంటూ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో కొండ చిలువలు, మొసళ్లని చూపిస్తూ కశ్మీర్లో మోడీ చేస్తున్నదానికి.. వీటితో కరిపిస్తానంటూ రెచ్చిపోయింది. అయితే జంతువులను ఇంట్లో పెట్టుకుని వాటితో వీడియో చేయడంపై పాక్ కోర్టు ఆమెపై అరెస్టు వారెంటు జారీ చేసింది. క్రూర జంతువుల్ని ఇంట్లో పెంచడం నేరమని పాక్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ కూడా కేసు పెట్టింది.