
పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో కీలక మలుపు..ర్యాష్ డ్రైవింగ్ కేసులో పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఈ కేసు విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు దుర్గారావును సస్పెండ్ చేశారు. డ్రైవింగ్ చేసిన సాహిల్ ను తప్పించి డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపణలు రావడంతో పంజాగుట్ట ఇన్ స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు పడింది.
డిసెంబర్ 23న ప్రజాభవన్ ఎదుట బారీ కేడ్లను షకీల్ కుమారు సాహిల్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు మరో ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కారు ర్యాష్ డ్రైవింగ్ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ కేసులో సాహిల్ ను తప్పించి మరొకరు కారు నడుపుతున్నట్టు పోలీసులు కేసు నమోదు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనపై సీపీ విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసింది షకీల్ కుమారుడు సాహిల్ అని తేల్చారు పోలీసులు. షకీల్ కొడుకు సాహిల్ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.