తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్ సెల్వంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీనితో ఆయన చెన్నెలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. తేలికపాటి లక్షణాలతో ఆయన శుక్రవారం ఉదయమే అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య బృందం సలహా మేరకు మందులు తీసుకుంటున్నట్టుగా ఎంజీఎం హెల్త్కేర్ ఓ మెడికల్ బులిటిన్ విడుదల చేసింది. పన్నీర్ సెల్వం త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. కొద్ది రోజుల క్రితం పన్నీర్సెల్వం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం రోజున 2,312 కొత్తకరోనా కేసులు నమోదు కాగా, ఒక్కరు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,487 యాక్టివ్ కేసులున్నాయి.
O Panneerselvam, former Deputy Chief Minister of Tamil Nadu admitted to the isolation unit at MGM Healthcare on 15th July with mild symptoms of #COVID19. He's currently under observation. He is stable & on medication as advised by the Clinical team: MGM Healthcare
— ANI (@ANI) July 16, 2022
(File photo) pic.twitter.com/BmcGHFd64E