ఎండాకాలంలో చర్మం తొందరగా పొడిబారుతుంది. మాయిశ్చర్ తగ్గిపోవడంతో ముఖమంతా పాలిపోయినట్టు కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ సీజన్లో దొరికే బొప్పాయి పండుతో చేసిన ఫేస్ప్యాక్ వేసుకుంటే చర్మం మునుపటిలా అవుతుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ట్యాన్ని తగ్గిస్తాయి. చర్మానికి తేమని అందిస్తాయి అంటున్నాడు డెర్మటాలజిస్ట్ రింకీ కపూర్.
కావాల్సినవి: బొప్పాయి పండు ముక్కలు– ఒక కప్పు, తేనె– రెండు టేబుల్ స్పూన్లు, చల్లని పాలు– రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: బొప్పాయి పండు ముక్కలు, తేనె, పాలను మిక్సీలో మెత్తటి గుజ్జులా చేయాలి. ఈ పేస్ట్ని ముఖం, మెడ మీద రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం ఫ్రెష్గా కనిపిస్తుంది.