కూతురు ఫోటోకు కేక్‌ తినిపిస్తూ కన్నీరుమున్నీరు

కూతురు ఫోటోకు కేక్‌ తినిపిస్తూ కన్నీరుమున్నీరు

కళ్ల ముందు ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే చిన్నారిని విష జ్వరం పొట్టనపెట్టుకుంది. నెల రోజుల కిందట జ్వరంతో జగిత్యాల జిల్లా వెల్గటూర్ కు చెందిన రాజు, రసజ్ఞ దంపతుల నాలుగేళ్ల చిన్నారి జ్ఞానన్వి  చనిపోయింది. అయితే నిన్న చిన్నారి బర్త్ డే కావడంతో తలిదండ్రులు ఆమె సమాధి దగ్గర వేడుకలు నిర్వహించారు. దంపతులిద్దరూ చిన్నారి ఫోటోకు కేకే తినిపిస్తూ కన్నబిడ్డను యాదీ చేస్తున్నారు. కూతురు  ఫోటోకు కేక్‌ తినిపిస్తూ తల్లి రోదించిన తీరు అక్కడున్న వారందరిని కంటతడి పెట్టించింది.