
జీడిమెట్ల, వెలుగు: పార్క్ చేసిన వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 బైక్లు, ఓ కారు, గూడ్స్వెహికల్ను స్వాధీనం చేసుకున్నారు. సూరారం సాయిబానగర్కు చెందిన మొబైల్ మెకానిక్నక్క శ్రీనివాసరావు(32), దుండిగల్ బౌరంపేటకు చెందిన మహ్మద్ షోహిబ్(26) స్నేహితులు. జల్సాలకు అలవాటు పడి 2014 నుంచి వెహికల్స్ చోరీ చేస్తున్నారు. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా చోరీలు మానలేదు. పోలీసులు సోమవారం వీరిని అరెస్ట్ చేసి, 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటివరకు 15 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.