పార్కింగ్​ చేసిన వాహనాలు చోరీ..ఇద్దరు అరెస్ట్

పార్కింగ్​ చేసిన వాహనాలు చోరీ..ఇద్దరు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: పార్క్​ ​చేసిన వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరిని ​పోలీసులు అరెస్ట్​ చేశారు. 8 బైక్​లు, ఓ కారు, గూడ్స్​వెహికల్​ను స్వాధీనం చేసుకున్నారు. సూరారం సాయిబానగర్​కు చెందిన మొబైల్​ మెకానిక్​నక్క శ్రీనివాసరావు(32), దుండిగల్​ బౌరంపేటకు చెందిన మహ్మద్​ షోహిబ్​(26) స్నేహితులు. జల్సాలకు అలవాటు పడి 2014 నుంచి వెహికల్స్ ​చోరీ చేస్తున్నారు. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా చోరీలు మానలేదు. పోలీసులు సోమవారం వీరిని అరెస్ట్​ చేసి, 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటివరకు 15 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.