అవే నా చివరి ఎన్నికలు..ఆ తర్వాత నా వారసులే వస్తారు

అవే నా చివరి ఎన్నికలు..ఆ తర్వాత నా వారసులే వస్తారు

వచ్చే ఎన్నికల్లో తాండూరు నుంచి  పోటీ చేస్తానని..అవే తనకు చివరి ఎన్నికలని అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. 2028 లో తన వారసులు  పోటీ చేస్తారన్నారు. లండన్ లో ఉన్న తన కొడుకు వికారాబాద్ నుంచి .. తన అన్న కొడుకు అవినాష్ రెడ్డి రంగారెడ్డి నుంచి పోటీలో ఉంటారన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అసలు పైలెట్ కాదన్నారు. అభ్యర్థిగా ఇంటర్మీడియట్  సర్టిఫికేట్ పెట్టి.. గెలిచాక ఎంబీఏ సర్టిఫికేట్ పెట్టాడన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డిని తానే రాజకీయాల్లోకి  తీసుకొచ్చానని చెప్పారు.