- పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: రైతులకు బేడీలు వేసి వారు రైతులు కాదని చెప్పడం దారుణమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్ కుమార్ గౌడ్అన్నారు. తెలంగాణలో రైతులకున్న కష్టాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లా డారు. అప్పట్లో ఖమ్మం జిల్లా రైతులకు బేడీలు వేశారని, ఇప్పుడు భువనగిరి రైతులకు సంకెళ్లు వేశారన్నారు. రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసేటోళ్లు దేశంలో రైతురాజ్యం తెస్తారా? అని ఫైర్ అయ్యారు. రైతుల భూము లను కబ్జా చేసినోళ్లను అందలం ఎక్కించి, ప్రశ్నించిన రైతులకు మాత్రం బేడీలు వేస్తారా? అని నిలదీశారు. ధరణి పేరిట బీఆర్ఎస్ నేతలు భూములను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కొందరు కలెక్టర్లు ధరణి పేరుతో పేదల భూముల్లో స్కామ్లకు పాల్పడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.