
కోల్ బెల్ట్: భాదిత కుటుంబాలకు అండగా ఉంటామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఇవాళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అమ్జద్ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న చోటమాను వారు పరామర్శించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కో ఆప్షన్ సభ్యులు అన్వర్ ఖాన్ కొంతకాలంగా అనారోగ్యంతో గురికాగా ఆయనను పరమర్శించారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. అంతకుముందు తెలంగాణ ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఏఎంసీ చౌరస్తాలో దివంగత నేత మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.