ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలి

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలి

 

మల్కాజిగిరి, వెలుగు: ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలని, స్కాలర్​షిప్‌లను పెంచాలని డిమాండ్ ​చేస్తూ గురువారం గ్రేటర్​ హైదరాబాద్ ​బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్​హైదరాబాద్​బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నీరడి భూపేష్​సాగర్​మాట్లాడుతూ.. దాదాపు14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు ప్రభుత్వం రిలీజ్​చేయాల్సి ఉందన్నారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్​షిప్​లు రెండు శాతం పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్​కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం దారుణం అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ ఆఫీసులో ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మనోజ్​చారి, శివకుమార్, సుమన్, రాబిన్, సాయితేజ, బసవ, రాజారావు, సాజిద్, జ్యోతిరాజ్, వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.