మల్కాజిగిరి, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, స్కాలర్షిప్లను పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్హైదరాబాద్బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నీరడి భూపేష్సాగర్మాట్లాడుతూ.. దాదాపు14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలు ప్రభుత్వం రిలీజ్చేయాల్సి ఉందన్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్లు రెండు శాతం పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం దారుణం అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ ఆఫీసులో ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మనోజ్చారి, శివకుమార్, సుమన్, రాబిన్, సాయితేజ, బసవ, రాజారావు, సాజిద్, జ్యోతిరాజ్, వివిధ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.