ఏం చెప్పామో అదే చేశాం

ఏం చెప్పామో అదే చేశాం

GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు నమ్మాలని తెలిపారు. తాము ఏం చెప్పామో అదే చేశామని, తాము చేయగలిగిందే చెబుతామని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన హామీలనే చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కళ్లముందే ఉందని, ప్రజలు ఆ విషయాన్ని గమనించాలని సూచించారు. హైదరాబాద్ పౌరుడిని అయినందుకు గర్విస్తున్నానన్నారు.

డిసెంబరు 1న జరిగే GHMC ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ ఓటు ద్వారా అభివృద్ధిని ఎంచుకోవాలని, విభజన శక్తులను దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు.