సమైక్య ముసుగులో చంద్రబాబు వస్తుండు: శ్రీనివాస్ గౌడ్

సమైక్య ముసుగులో చంద్రబాబు వస్తుండు: శ్రీనివాస్ గౌడ్

జై తెలంగాణ అనడానికి కూడా నోరు రాని వ్యక్తి చంద్రబాబు అని, ఇప్పుడు ఎందుకు వచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమైక్య ముసుగులో ఇక్కడ డిస్ట్రబ్ చేయడానికి చంద్రబాబు వచ్చారని ఆరోపించారు. అయన హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను వేధించాడని చెప్పారు. ఆయన వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు.

తమ మీదికి ఇప్పటికే 5 మందిని వదిలారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్ చేశారు. అంగన్ వాడీలపై లాఠీ చార్జి చేయించింది కూడా చంద్రబాబేనని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. తెలంగాణకు అడ్డుపడి వేల మంది చావుకు చంద్రబాబు కారణం అయ్యారన్నారు. దమ్మున్న నాయకుడు తమ వెనక వున్నాడని ప్రజలు అనుకుంటున్నరన్న మంత్రి... చంద్రబాబు మాయలో పడరని విశ్వాసం వ్యక్తం చేశారు.