- బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు పెరిక సురేశ్ వినతి
హైదరాబాద్, వెలుగు: బీసీలకు అత్యధిక పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని బీజేపీ హైకమాండ్ ను ఓబీసీ మోర్చా నెషనల్ మెంబర్ పెరిక సురేశ్ కోరారు. ఈ మేరకు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో 5 రిజర్వు స్థానాలు మినహా మిగిలిన 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు కేటాయించాలన్నారు.
నల్గొండ పార్లమెంటు పరిధిలో పెరిక సామాజిక వర్గానికి చెందినోళ్లు లక్షా 50 వేల మంది ఉన్నారని, అందువల్ల ఈ స్థానంలో తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. తనకు సీటిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీల మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు.