మద్యం తాగి కోడి గుడ్డు తింటుండగా మృతి

మద్యం తాగి కోడి గుడ్డు తింటుండగా మృతి

ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి), వెలుగు: గొంతులో గుడ్డు ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న శ్రీరామ వైన్స్​ పర్మిట్ రూంలో యాచారం మండలం గున్​గల్​కు చెందిన మచ్చ యాదయ్య(45) సహాయకుడిగా పనిచేస్తున్నాడు. గురువారం వైన్స్​లో మద్యం తాగి కోడి గుడ్డు తింటుండగా అది గొంతులో ఇరుక్కుని అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే యాదయ్య చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.