కారు ఢీకొని వ్యక్తి మృతి

కారు ఢీకొని వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి: కారు ఢీకొని వ్యక్తి మరణించిన సంఘటన  యాదగిరిగుట్ట మండలం రామాజిపేటలో జరిగింది. ఆదివారం ఉదయం రామాజిపేట నగరానికి చెందిన మంచాల యాదగిరి(50) సైకిల్ పై రోడ్డు దాటుతుండగా స్పీడ్ గా వచ్చిన కారు ఢీకోట్టింది. హైదరాబాద్-వరంగల్ నేషనల్ హైవే 163లో జరిగిన ఈ ప్రమాదంలో మంచాల యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడికుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు రోడ్డుపై బైటాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.  కారు హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు స్థానికులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.