చెట్టు కొమ్మలను కొడుతుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

చెట్టు కొమ్మలను కొడుతుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి

హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కరెంట్ షాక్ తో వ్యక్తి మృతిచెందాడు.మియాపూర్ బీకే ఎన్ క్లేవ్ లో విద్యుత్ తీగలకు అడ్డొస్తున్న చెట్టు కొమ్మలను కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

విద్యుత్ శాఖ అనుమతి లేకుండా చెట్టు కొమ్మలను కొట్టిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విద్యుత్ కట్ చేయడకుండా వైర్లకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను కొడుతుండగా.. గొడ్డలి విద్యుత్ వైర్లకు తాకడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.