ఆసరా పెన్షన్లు సరిగ్గా అందడం లేదని వృద్ధులు, వికలాంగుల ధర్నా

ఆసరా పెన్షన్లు సరిగ్గా అందడం లేదని వృద్ధులు, వికలాంగుల ధర్నా

రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం ముందు వృద్ధులు, వికలాంగులు ధర్నా చేపట్టారు. ఫరూక్ నగర్ మండలంలోని ఘంట్ల వెళ్లి గ్రామం దేవునిబండ తండాల్లో గత నాలుగు ఐదు నెలల నుండి వృద్దులకు.. వికలాంగులకు ఆసరా పెన్షన్లు అందడం లేదు. ఓపిక నశించిన వృద్ధులు, వికలాంగులు ధర్నా చేపట్టారు. వేసవికాలం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని.. విసిగి వేసారిన వృద్ధులు, వికలాంగులు ధర్నా చేపట్టారు. పెన్షన్లు ఇచ్చే పోస్ట్ మ్యాన్ ను వెంటనే మార్చాలని.. మహిళల పట్ల అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడాని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు పెన్షన్లు ఇవ్వాలని కోరుతూ ఎంపిడిఓకు వినతిపత్రం అందజేశారు.