ఫిలిప్పీన్స్లో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగలేదు.ఫిలిప్పీన్స్లో 122 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఓ తైవాన్ విమానం నిన్న ఫిలిప్పీన్స్లోని కలిబో ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అయితే విమానం రన్వే చివర్లో మలుపుతిరుగుతుండగా గడ్డిలో చక్రం చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన విమాన పైలట్ వెంటనే అలర్టై విమానాన్ని నిలిపివేశారు. ఎయిర్పోర్టు సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. తర్వాత తనిఖీల నిమిత్తం విమానాన్ని ఎయిర్పోర్టు టర్మినల్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.