- ప్రతి ఇంటి మీద ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లపై ఇందిరా గాంధీ ఫొటోతో శిలాఫలకం ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నెల 2న ఇందిరమ్మ ఇండ్లపై వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ శిలాఫలకాలను కార్మిక శాఖ పరిధిలో రన్ అవుతున్న ఐటీఐ స్టూడెంట్స్ రెడీ చేస్తున్నారు.
మొత్తం నాలుగు డిజైన్లు రెడీ చేసి హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చూపించగా ఇందులో ఒక డిజైన్ ను మంత్రి ఫైనల్ చేశారు. ఈ డిజైన్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటో, సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి ఫొటోలు ఉన్నాయి. మల్లెపల్లి, విజయ్ నగర్ కాలనీ ఐటీఐల్లో వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ వీటిని డిజైన్ చేసినట్లు కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు.
