
IPL 2020 సీజన్ ఆటగాళ్ల వేలం డిసెంబర్ 19న కోల్కతా వేదికగా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన మొత్తం 971 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా, వారిలో నుంచి 73 మందిని మాత్రమే ఫ్రాంచైజీలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రూ. 2 కోట్ల కనీస ధరతో ఏడుగురు క్రికెటర్లు… రూ. 1.5 కోట్ల కనీస ధరతో మరో 9 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
రూ. 2 కోట్ల ఆటగాళ్ల లిస్టులో జాబితాలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హేజల్వుడ్ ముందు వరుసలో ఉన్నారు. ఆ దేశానికి చెందిన బ్యాట్స్మెన్లు గ్లెన్ మాక్స్వెల్, క్రిస్లిన్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఉన్నారు. వీరితోపాటు శ్రీలంక నుంచి ఏంజెలో మాథ్యూస్, దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ ఉన్నారు. వీరిని కొనాలని భావించే ఫ్రాంచైజీ రూ. 2 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాల్సివుంటుంది.
ఇక రూ. 1.5 కోట్ల విలువైన క్లబ్ రేస్ లో ఇండియన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ముందంజలో ఉండగా ఆ తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్, కేన్ రిచర్డ్సన్, ఇగ్లాండ్కు చెందిన డేవిడ్ విల్లీ, క్రిస్వోక్స్, జేసన్ రాయ్, ఇయాన్ మోర్గాన్ తో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్, కెల్లీ అబ్బాట్ ఉన్నారు.