తెలంగాణలో మూడ్రోజులు ప్రధాని మోదీ టూర్

 తెలంగాణలో మూడ్రోజులు ప్రధాని మోదీ టూర్
  • 16, 18, 19 తేదీల్లో సభలు

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ అగ్రనేతలు ఒక్కొక్కరు రాష్ర్టానికి వస్తున్నాయి. మంగళవారం అమిత్ షా రానుండగా, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ర్టంలో పర్యటించనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దక్షిణాది రాష్ర్టాలకు ఐదు రోజుల పాటు మోదీ షెడ్యూల్ ఇవ్వగా, దాంట్లో మూడు రోజులు తెలంగాణలో షెడ్యూల్ ఉన్నట్టు సమాచారం. ఈ నెల 16,18,19 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో మోదీ పాల్గొని, ప్రసంగించనున్నారు.

ఒక్కోరోజు రెండు, మూడు పార్లమెంట్ స్థానాలను కలుపుతూ ఒక్కో సభ పెట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. మల్కాజిగిరి, జగిత్యాల, నాగర్ కర్నూల్ లో సభలు పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తేనే.. ఈ తేదీల్లో సభలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ షెడ్యూల్ ఆలస్యమైతే.. మోదీ టూర్ తేదీలు మారే చాన్స్ ఉందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.