న్యూఢిల్లీ: ట్విట్టర్లో ప్రధాని నరేంద్ర మోడీని ఫాలో అవుతున్నోళ్ల సంఖ్య 7 కోట్లు దాటింది. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్లలో ఎక్కువమంది ఫాలో అవుతున్న నేతగా మోడీ రికార్డు సృష్టించారు. మోడీ తర్వాత పోప్ ఫ్రాన్సిస్ను 5.3 కోట్ల మంది ఫాలో అవుతున్నరు. 2009లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ ట్విట్టర్ వాడకాన్ని ప్రారంభించగా.. 2010లో లక్షమంది ఆయనను ఫాలో అయ్యారు. 2020 జులై నాటికి ఫాలోవర్ల సంఖ్య 6 కోట్లకు.. ఇప్పుడు 7 కోట్లకు చేరింది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్కు ట్విట్టర్లో 3.9 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు 12.98 కోట్లు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మెక్రాన్కు 71 లక్షల ఫాలోవర్లుఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాను 2.63 కోట్ల మంది, కాంగ్రెస్లీడర్ రాహుల్ గాంధీ ట్విట్టర్ను 1.94 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. మొదట్లో 8.87 కోట్ల ఫాలోవర్లతో అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న యాక్టివ్ పొలిటీషియన్గా రికార్డు సృష్టించారు. అయితే, ఆయన అకౌంట్ను ట్విట్టర్ శాశ్వతంగా సస్పెండ్చేసింది.