మైలార్ దేవులపల్లిలో  బెట్టింగ్ ..భారీగా నగదు స్వాధీనం

మైలార్ దేవులపల్లిలో  బెట్టింగ్ ..భారీగా నగదు స్వాధీనం

హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. లక్షలకు లక్షలు పందాలు కాస్తూ బెట్టింగ్ రాయళ్లు జేబులు నింపుకుంటున్నారు. అయితే ఐపీఎల్ బెట్టింగ్ పై నిఘా పెట్టిన పోలీసులు..నిందితులను పట్టుకుంటున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నా..బెట్టింగ్ కాయడం మాత్రం మానడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుల పల్లిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లిలో  బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..బెట్టింగ్ స్పాట్కు వెళ్లారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న రవితేజ. మనోజ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  రూ. 13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.