గొడ్డలితో తల్లిని నరికి చంపిన సైకో.. 100 మంది పోలీసుల స్పెషల్ ఆపరేషన్

గొడ్డలితో తల్లిని నరికి చంపిన సైకో.. 100 మంది పోలీసుల స్పెషల్ ఆపరేషన్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో  సైకో  రెచ్చిపోయాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కంచరకుంట్ల రాజిరెడ్డి అనే వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేక కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపాడు. పక్కింట్లో ఉండే మహిళ ఊకంటి జ్యోతి పైన  గొడ్డలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న ఆమెను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

దాడి చేసిన సైకో ను గోరుకొత్త పల్లి మండలం,చిన్న కోడెపాక గ్రామంలో పట్టుకున్నారు. స్థానికుల సహకారంతో రేగొండ సీఐ వేణుచందర్ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్ఐలు,100 మంది పోలీసులతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.