ఏటీఎంలో 6 లక్షలు చోరీ.. మరో ఏటీఎం దగ్గర దొరికాడు

ఏటీఎంలో 6 లక్షలు చోరీ.. మరో ఏటీఎం దగ్గర దొరికాడు

ఏటీఎం పగలకొట్టి 6.50 లక్షలు ఎత్తుకెళ్లిండు
 మరో ఏటీఎంలో చోరీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు
 హైదరాబాద్​లోని నల్లగండ్లలో ఘటన

శేరిలింగంపల్లి, వెలుగు: ఏటీఎం మెషీన్​ పగలకొట్టి రూ. 6.50 లక్షల డబ్బును దొంగ ఎత్తుకెళ్లాడు. సమాచారం తెలుసుకుని చందానగర్​ పోలీసులు నిందితుడు మరో ఏటీఎం వద్ద చోరీకి ప్రయత్నం చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో  నల్లగండ్లలోని అపర్ణ జెనిత్​ఎదురుగా యూనియన్​ బ్యాంక్​ ఏటీఎంలో ఓ దొంగ చొరబడి ఏటీఎం పగలకొట్టి రూ. 6.50 లక్షలు ఎత్తుకెళ్లాడు. చందానగర్​లోని హుడా లే అవుట్​లోని మరో బ్యాంక్​ ఏటీఎం మెషీన్​పగులకొట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నల్లగండ్ల కు చెందిన ఎలక్ట్రిషియన్ ​రాజుగా గుర్తించి కేసు నమోదు చేశారు.