ఏటీఎం పగలకొట్టి 6.50 లక్షలు ఎత్తుకెళ్లిండు
మరో ఏటీఎంలో చోరీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్లోని నల్లగండ్లలో ఘటన
శేరిలింగంపల్లి, వెలుగు: ఏటీఎం మెషీన్ పగలకొట్టి రూ. 6.50 లక్షల డబ్బును దొంగ ఎత్తుకెళ్లాడు. సమాచారం తెలుసుకుని చందానగర్ పోలీసులు నిందితుడు మరో ఏటీఎం వద్ద చోరీకి ప్రయత్నం చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో నల్లగండ్లలోని అపర్ణ జెనిత్ఎదురుగా యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో ఓ దొంగ చొరబడి ఏటీఎం పగలకొట్టి రూ. 6.50 లక్షలు ఎత్తుకెళ్లాడు. చందానగర్లోని హుడా లే అవుట్లోని మరో బ్యాంక్ ఏటీఎం మెషీన్పగులకొట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నల్లగండ్ల కు చెందిన ఎలక్ట్రిషియన్ రాజుగా గుర్తించి కేసు నమోదు చేశారు.